కాలినడకన వచ్చే భక్తుల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం : భూమన

-

తిరుమలలో దారుణం చోటుచేసుకుంది. అలిపిరి కాలినడక మార్గంలో చిరుత దాడిలో ఓ చిన్నారి మృతి చెందింది. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంకు చెందిన దినేష్‌ దంపతులు.. తమ గారాలపట్టి లక్షిత, బాబుతో కలిసి కారులో తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనానికి బయల్దేరారు. అలిపిరి నుంచి మెట్ల మార్గంలో దేవదేవుని వద్దకు నడక సాగిస్తుండగా ఘోరం జరిగింది. క్రూరమృగం ఆ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. బాలిక లక్షితను చిరుత చంపేసింది.

Bhumana Karunakar Reddy Is TTD's New Chairman!

కాగా, టీటీడీ నూతన చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి… లక్షితపై చిరుత దాడి చేసిన ప్రాంతాన్ని ఈ మధ్యాహ్నం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుమల కొండపైకి కాలినడకన వచ్చే భక్తులకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. అటవీశాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news