మా జంటను వీడతీయొద్దు.. ఇద్దరు యువతుల ఆవేదన..

-

ప్రాశ్చాత్య దేశాల్లో స్వంలింగ సంపర్క వివాహాల సంస్కృతి ఇండియాలో కూడా వ్యాప్తి చెందుతోంది. రోజు రోజుకు భారత్ లో స్వలింగ సంపర్కుల వివాహాల సంఖ్య పెరుగుతుంది. 2018లో సుప్రీంకోర్టు స్వలింగ సంపర్కాన్ని నేరంగా భావించే సెక్షన్‌ 377 రద్దు అనంతరం ఈ తరహా వివాహాలు, బంధాల కోసం సదరు వ్యక్తులు సమాజంలో న్యాయం కోసం పోరాటాల సంఖ్య పెరిగింది. అయితే.. తాజాగా అలాంటి ఓ ఘటనే బిహార్​లోని పట్నాలో చోటు చేసుకుంది. ఇంద్రపురికి చెందిన తనిష్క్​ శ్రీ అనే యువతి.. సహస్ర ప్రాంతానికి చెందిన శ్రేయా ఘోష్ అనే మరో యువతి ప్రేమించుకున్నారు. ఈ ఇద్దరికి గత ఐదేళ్లుగా పరిచయం ఉండగా.. ఈ మధ్యే అది ప్రేమగా మారి.. కలిసి జీవించాలనుకున్నారు.

Two Girls Love: యువతుల మధ్య ప్రేమ.. రక్షణ కల్పించాలని పోలీసుల ఆశ్రయం!

ఈ విషయం వారి కుటుంబ సభ్యులు తెలియడంతో తనిష్క్​ను ఆమె కుటుంబ సభ్యులు ఇంట్లో నిర్భందించి, శ్రేయా ఘోష్​పై నకిలీ కిడ్నాప్ కేసును కూడా పెట్టారు. దీంతో.. ఎలాగోలా ఇంట్లో నుండి తప్పించుకున్న తనిష్క్, శ్రేయా ఘోష్ తో కలిసి పట్నాలోని మహిళా పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేసినా అక్కడి పోలీసులు కేసు నమోదుకు నిరాకరించారట. దీంతో ఈ మహిళా జంట పట్నా ఎస్​ఎస్​పీని కలిసి ఫిర్యాదు చేసి.. తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. స్వలింగ సంపర్కుల లైంగిక చట్టం ప్రకారం తమకు కలిసి ఉండే హక్కు ఉందని.. కుటుంబ సభ్యులతో సహా ఎవరికి తమను విడదీసే హక్కు లేదని పోరాడుతున్నారు తనిష్క్, శ్రేయా ఘోష్.

Read more RELATED
Recommended to you

Latest news