బోర్డు పరీక్షలు రద్దు చేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్.. ఆ రాష్ట్రాలకు ఇబ్బందే

-

కరోనా మహమ్మారి విద్యార్థుల పాలిట శాపంగా మారింది. దీనివల్ల ఇప్పటికే రెండు సంవత్సరాలు వృధా అయిపోయాయి. గత ఏడాది పరీక్షలు లేకుండానే గడిచిపోయింది. ఈ ఏడాది అయితే పాఠశాలలు కూడా సరిగ్గా ప్రారంభం కాలేదు. నడిచిన రెండు ముడు నెలలకి కూడా చాలా ప్రభుత్వాలు పరీక్షలను రద్దు చేసాయి. కరోనా థర్డ్ వేవ్ భయం నేపథ్యంలో పరీక్షలు నిర్వహించడం సరికాదని అంటున్నారు. ఈ మేరకు సుప్రీం కోర్టులో పిటిషన్ కూడా వేసారు.

అస్సాం, ఏపీ, పంజాబ్, కేరళ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు బోర్డు పరీక్షలు నిర్వహించాలని అనుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది వ్యతిరేకత తెలియజేస్తున్నారు. ఇప్పుడది సుప్రీం కోర్టు దాకా వెళ్ళింది. ఈ రాష్ట్రాల్లో కూడా బోర్డు పరీక్షలను రద్దు చేయాలని, పిల్లల ఆరోగ్యంతో ఆడుకోవద్దని, థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని వార్తలు వస్తున్న కారణంగా పరీక్షలను రద్దు చేయాలని సుప్రీం కోర్టుకి వెళ్ళారు. మరి సుప్రీం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news