వైరల్ వీడియో మాట్లాడుతూ మాట్లాడుతూ ఆగిపోయిన లోకేష్, ఎందుకంటే…!

-

తెలుగుదేశం పార్టీ ఇప్పుడు రాజధాని అమరావతి కోసం తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అమరావతి ప్రాంతంలో నిరసనలు చేస్తున్న రైతులకు మద్దతుగా తెలుగుదేశం నేతలు పెద్ద పోరాటమే చేస్తున్నారు. వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా సరే తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున మద్దతు ఇస్తుంది. అమరావతిని రాజధానిగా ఉంచాలని కోరుతూ రాజధాని ప్రాంత రైతులతో పాటుగా,

తెలుగుదేశం నేతలు పోరాడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. అది అలా ఉంటే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రైతులకు మద్దతుగా పోరాటం చేస్తున్నారు. జాతీయ రహదారి దిగ్బంధనానికి ఆయన నిన్న మద్దతు ఇవ్వగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ తరుణంలో ఇప్పుడు ఆయనకు సంబంధించి ఒక వీడియో వైరల్ అవుతుంది.

రైతులకు మద్దతుగా మాట్లాడుతూ మాట్లాడుతూ లోకేష్ ప్రసంగాన్ని ఆపేశారు. ఎందుకు అంటే మసీద్ లో ప్రార్ధనలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోని తెలుగుదేశం ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. “రాజధాని అంశంపై వైసీపీ ప్రభుత్వ కుట్రలపై మీడియా సమావేశంలో ఆవేశంగా మాట్లాడుతున్న తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఉన్నట్టుండి ప్రసంగాన్ని ఆపేసారు. ఏమిటా అని వింటే మసీదు నుంచి ప్రార్థన వినిపిస్తోంది. ప్రజలందరి మత విశ్వాసాలను, మనోభావాలను గౌరవించగలిగిన వారే అసలైన నాయకులు” అని పోస్ట్ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news