లోకేష్ యువగళం పాదయాత్ర సెన్సేషనల్ హిట్ అవుతుంది – గంటా శ్రీనివాసరావు

-

విశాఖ లోని టిడిపి ఆఫీసులో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమానికి హాజరయ్యారు గంటా శ్రీనివాసరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు ఒక వైబ్రేషన్ అన్నారు. పార్టీని స్థాపించి 9 నెలలులోనే అధికారంలోకి వచ్చిన ఘనత ఎన్టీఆర్ దని అన్నారు. తెలుగు నేలపై ఎన్టీఆర్ ది చెరగని సంతకం అని పేర్కొన్నారు గంటా. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటి చెప్పిన మహా వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాల్లో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించారన్నారు.

పరిపాలన పరంగా ఎన్నో సంస్కరణలు తెచ్చిన ఘనత ఎన్టీఆర్ దేనన్నారు. రాబోయే రోజుల్లో టిడిపి ఘన విజయాలు సాధిస్తుందన్నారు. లోకేష్ పాదయాత్ర ఈ నెల 27 నుంచి ప్రారంభం అవుతుందని.. 400 రోజులు..4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారని తెలిపారు. 175 నియోజక వర్గాల్లో అన్ని ఏర్పాటు జరుగుతున్నాయన్నారు. లోకేష్ యువగళం పాదయాత్ర సెన్సేషనల్ హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. దేశానికి యువత వెన్నుముక అని.. అలాంటి యువత రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు పడుతోందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news