ఎన్టీఆర్ ఆదర్శమైతే వెన్నుపోటు ఎందుకు పొడిచారు – కొడాలి నాని

-

స్వర్గీయ ఎన్టీఆర్ ఆదర్శమైతే ఆయనని వెన్నుపోటు ఎందుకు పొడిచారని ప్రశ్నించారు మాజీమంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని. కృష్ణాజిల్లా గుడివాడలో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలలో పాల్గొన్నారు కొడాలి నాని. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఆయన మాట్లాడుతూ.. తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న చిరస్మరణీయ వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు.

ఎన్టీఆర్ గొప్పతనాన్ని గుర్తుంచుకున్న ముఖ్యమంత్రి జగన్ జిల్లాకు ఆయన పేరు పెట్టారని అన్నారు. ఎన్టీఆర్ పేరు, ఫోటోలతో అనేకమంది రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆయనని క్షోభకి గురి చేసిన వారిని అభిమానులు మట్టికరించారని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ పేరుతో నేటికీ ఓట్లు పొందుతున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ పదవిని దొంగిలించిన చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, అప్పటి నాయకులు నేటికి ఎన్టీఆర్ పేరుతో ఓట్లు పొందుతున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news