అనంతపురంలో ఘొరం : రెండు లారీలు ఢీ, ఓ డ్రైవర్ సజీవదహనం.!

-

అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం తాడిపత్రి సమీపంలోని కడప రహదారిపై రెండు లారీలు ఢీకొన్నాయి. తాడిపత్రి నుంచి వరిపొట్టు లోడుతో వెళ్తున్న లారీ, కడప నుంచి బొగ్గు లోడ్‌ తో తాడిపత్రి వైపు వస్తున్న మరో వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంతో మంటలు చెలరేగి ఓ లారీ డ్రైవర్‌ సజీవదహనమయ్యాడు.

ప్రమాదంలో మరో లారీలోని ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు శ్రమించి మంటలను అదుపుచేశారు. అనంతరం క్షతగాత్రులను బయటకు తీసి తాడిపత్రి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన.. ప్రమాదం ఎలా జరిగింది అనేదానిపై  పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, లారీ డ్రైవర్‌ ను ఉత్తర్‌ప్రదేశ్‌ కు చెందిన నిషార్‌‌గా గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news