ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం..10 మంది శిశువులు మృతి !

-

ఈరోజు ఉదయాన్నే దారుణ వార్త వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలో ఈ ఉదయం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో 10 మంది నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బాంద్రా జిల్లా ఆసుపత్రిలో ఈ తెల్లవారు జామున జరిగింది. బాంద్రా జిల్లా ఆసుపత్రిలోని న్యూ బోర్న్ కేర్ యూనిట్‌లో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో ఎన్‌సీయూలో మొత్తం 17 మంది చిన్నారులు ఉండగా వారిలో ఏడుగురిని రక్షించగలిగారు.

అప్పటికే 10 మంది చనిపోయారు. అయితే ఈ మంటలు ఎందుకు చెలరేగాయి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. సడన్ గా ఈ న్యూ బోర్న్  కేర్ యూనిట్ మంటలు చెల రేగాయి… మొదట పొగ రావడాన్ని గుర్తించిన ఓ నర్స్ మిగతా సిబ్బందికి, అధికారులకు సమాచారం ఇచ్చింది… వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు యత్నించారు. అయితే అప్పటికే పది మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. 

Read more RELATED
Recommended to you

Latest news