వట్టెం వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకున్న ప్రముఖ సినీ నటుడి భార్య …

-

నాగర్ కర్నూలు జిల్లాలో కొలువైన వట్టెం వెంకటేశ్వరస్వామికి నేడు ప్రత్యేక పూజలు నిర్వహించిన మహేశ్ బాబు భార్య నమ్రత శిరోద్కర్. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలంలో ఉన్న వట్టెం వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ప్రముఖ సినీ నటుడు మహేశ్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ దర్శించుకుని, స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆమె ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయంలోని గోశాలను కూడా ఆమె సందర్శించారు.

వట్టెం వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న మహేశ్ బాబు భార్య నమ్రత

మరోవైపు ఆలయానికి వచ్చిన నమ్రతకు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఆమెకు శాలువా కప్పి సత్కరించారు. ఆలయానికి సంబంధించిన వివరాలు ఉన్న పుస్తకాన్ని ఆమెకు బహూకరించారు. దర్శనానంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ…. వట్టెం వెంకటేశ్వరస్వామికి దేవాలయం చూస్తుంటే, తిరుమల ఆలయానికి వచ్చిన అనుభూతి కలిగిందని చెప్పారు. కాగా,ఇక్కడి స్వామి వారిని పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శించుకుంటుంటారు. బిజినేపల్లి మండలం వట్టెం గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న వెంకన్న కొండపై ఈ ఆలయం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news