మహేష్ నష్టాన్ని అంచనా వేసే, చిరంజీవిని కలిసారా…?

-

రాజకీయాలు సినిమా హీరోలను తాకిన తర్వాత కొన్ని కొన్ని ఇబ్బందికర పరిస్థితులు హీరోలు ఎదుర్కొంటున్నారు. గత కొన్నాళ్ళు గా హీరోలు సైలెంట్ గా ఉన్నా సరే కొన్ని వర్గాలు మాత్రం వాళ్ళను రెచ్చగొడుతూ ఏదొకటి సాధించాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అమరావతి ఉద్యమం జరుగుతుంది. ఎటు మాట్లాడితే ఏ చిక్కు వస్తుందో అని కృష్ణా గుంటూరు జిల్లాలకు చెందిన నటులు కొందరు,

ఆ అంశం గురించి మాట్లాడే ప్రయత్నం పెద్దగా చేయడం లేదు. మహేష్ బాబు విషయానికి వస్తే ఆయన స్వగ్రామానికి అమరావతి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ అమరావతి ఉద్యమం పెద్ద ఎత్తున జరుగుతుంది. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై మహేష్ బాబు స్పందించకపోవడంతో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు.

ఆయనపై ఇప్పటికే ఆరోపణలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే మహేష్ బాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారని అంటున్నారు. చిరంజీవిని తన సినిమా కార్యక్రమానికి పిలవడం ద్వారా చిరంజీవి ఫాన్స్ ని దగ్గర చేసుకుంటే ఆ రెండు జిల్లాల్లో వసూళ్లు తగ్గినా గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రలో నష్టం తగ్గే అవకాశం ఉందని మహేష్ బాబు భావించే చిరంజీవిని ఈ కార్యక్రమానికి పిలిచారని అంటున్నారు. దీనితో మెగా ఫాన్స్ లో కూడా మంచి క్రేజ్ వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news