మరో గంటలో మంటలు అదుపులోకి వస్తాయి : మంత్రి మహమూద్ అలీ

-

సికింద్రాబాద్ పరిధి నల్లగుట్టలోని ఓ షాపింగ్‌మాల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. డెక్కన్‌ నైట్‌వేర్‌ స్పోర్ట్స్‌ షోరూంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనాస్థలికి ఇప్పటికే మంత్రి తలసాని చేరుకుని సహాయక చర్యలు పరిశీలించారు. తాజాగా రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ కూడా ఘటనాస్థలికి చేరుకున్నారు.

ఘటనాస్థలికి చేరుకున్న మంత్రి మహమూద్ అలీ సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు. ప్రమాదం గురించి అధికారులను ఆరా తీశారు. మంటలార్పేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. అగ్ని ప్రమాదంలో ఎవరూ చనిపోలేదని తెలిపారు. ఇద్దరి ఆచూకీ మాత్రం తెలియడం లేదని చెప్పారు. ప్లాస్టిక్ వస్తువులు, రసాయనాల వల్లే మంటలు ఎక్కువగా వ్యాపిస్తున్నాయని అన్నారు.

“80 శాతం మంటలు తగ్గుముఖం పట్టాయి. మరో గంటలో మంటలు అదుపులోకి వస్తాయి. మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. మంటలు తగ్గిన తర్వాత ఘటనపై విచారణ జరిపిస్తాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం.” అని మంత్రి మహమూద్ అలీ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news