బాల‌య్య‌-చిరు మ‌ల్టీస్టార‌ర్ పై మైత్రి మూవీ మేక‌ర్స్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

-

గ‌త కొద్ది రోజుల నుంచి తెలుగు సినీ ప‌రిశ్ర‌మ లో.. సోషల్ మీడియా లో ఒక వార్త తెగ వైర‌ల్ అవుతుంది. మెగా స్టార్ చిరంజీవి.. నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ కాంబినేష‌న్ లో ఒక సినిమా రాబోతుంద‌ని అనే వార్త తెగ వైర‌ల్ అవుతుంది. అంతే కాకుండా ఈ స్టార్ కాంబో సినిమా ను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తుంద‌ని అని కూడా వార్త‌లు తెగ వినిపించాయి.

అయితే ఈ వార్త ల పై మైత్రీ మూవీ మేక‌ర్స్ స్పందించారు. ఈ రోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా వ‌స్తున్న పుష్ప సినిమా కు సంబంధించి నిర్వ‌హించిన ప్రెస్ మీట్ లో మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ వార్త‌ల పై ఆస‌క్తి కర మైన వ్యాఖ్య‌లు చేశారు. మెగా స్టార్ చిరంజీవి.. న‌ట సింహం బాల‌య్య క‌లిసి న‌టించే మ‌ల్టీ స్టార‌ర్ సినిమా అవ‌కాశం వ‌స్తే ఎవ‌రూ వ‌దులు కుంటార‌ని అన్నారు. అయితే వీరు చేసిన వ్యాఖ్య‌ల తో ఈ వార్త ల‌పై ఆస‌క్తి ఇంకా పెరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news