BREAKING NEWS : కాంగ్రెస్ ఎంపీ.. రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు కరోనా పాజిటివ్

-

కాంగ్రెస్ నేత, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు కోవిడ్ పాజిటివ్ గా తేలింది. అయితే ఖర్గేకు ప్రస్తుతం లక్షణాలు లేవని, హోం ఐసోలేషన్ లో ఉన్నారని ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే.. వరసగా పలువురు రాజకీయ ప్రముఖులు కరోన బారిన పడ్డారు. ఇప్పటికే కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ కరోనా బారిన పడ్దారు. వీరితో పాటు కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మైలకు కోవిడ్ పాజిటివ్ గా తేలింది. వీరితో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా కోవిడ్ బారిన పడుతున్నారు.

దేశంలో కోవిడ్ తీవ్రత పెరిగింది. కొన్ని రోజులకు ముందు కోవిడ్ కేసుల సంఖ్య కేవలం 10 వేలకు దిగువగానే ఉండేది. ప్రస్తుతం మాత్రం రెండు లక్షల మార్క్ ను దాటింది. మరోవైపు ఓమిక్రాన్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షల ఛట్రంలోకి వెళ్లాయి. పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు విధించారు.

Read more RELATED
Recommended to you

Latest news