మామ అల్లుళ్ళ ఆట షురూ.. మెగా ఫాన్స్ కి పూనకాలే!

-

టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్లో మొదటిసారి తన ఫ్యామిలీ హీరో తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. అది కూడా జస్ట్ గెస్ట్ రోల్ కాకుండా కంప్లీట్ మల్టీస్టారర్ మూవీ గా తెరకెక్కించబోతున్నారు..

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటిసారి తన ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోతో మల్టీ స్టార్ సినిమా చేయబోతున్నారు. ఆ హీరో ఎవరో కాదు మెగా అల్లుడు సాయిధరమ్ తేజ్. సముద్ర ఖని డైరెక్ట్ చేసిన తమిళ సినిమా వినోదాయ సీతం తెలుగులో రీమేక్ అవుతుండగా ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటు సాయి ధరమ్ తేజ నటిస్తున్నారు..

ఈ సినిమా తమిళంలో ఓటీటీ రిలీజై మంచి హిట్గా నిలిచింది. ఇలాంటి సినిమాను టాలీవుడ్ లో స్టార్ హీరో రీమేక్ చేయడం విశేషం అనే చెప్పాలి.. తమిళంలో దర్శకత్వ వహించిన సముద్ర ఖనికే ఈ సినిమాను దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చారు.. పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఈ సినిమాలో కథ పెద్దగా లేదని అందుకే తెలుగులో రీమేక్ చేయొద్దు అంటూ ఇప్పటికే ఎన్నో కామెంట్లు పెడుతూ వస్తున్నారు. అయితే సినిమాలో కథ కన్నా ఇద్దరు హీరోలు తమ పాత్రలతో ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తారని సినీ బృందం హామీ ఇస్తుంది..

అయితే ఏ మెగా హీరోతో స్క్రీన్ షేర్ చేసుకొని పవన్ కళ్యాణ్ మొదటిసారి సాయి ధరంతేజ్ తో సినిమా చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సాయి ధరంతేజ్ తన మామ పవన్ కళ్యాణ్ అంటే తనకు గురువుని, ఎంతో గౌరవం అని చెప్పుకొస్తూనే ఉంటారు. ఈ మామ అల్లుళ్ళ ఆట ఎలా ఉంటుందో చూడాలి మరి..

అయితే ఈ ఏడాది పవన్ కళ్యాణ్ నుంచి హరహర వీరమల్లు సినిమా కూడా రానున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సుజిత్ తో గ్యాంగ్ స్టార్ సినిమా కూడా లైన్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్లో పూర్తయ్యాక పవన్ కళ్యాణ్ వినోదయ సీతం సినిమాను చేయనున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమాకు మరి ఎక్కువగా కాకుండా 25 నుంచి 30 రోజులు మాత్రమే పవన్ కళ్యాణ్ కేటాయించనున్నారని తర్వాత ఎన్నికల్లో బిజీ కానున్నట్టు తెలుస్తోంది..

Read more RELATED
Recommended to you

Latest news