బీజేపీకి ఒక్క సీటు కూడా రాకూడదు: సీఎం మమతా బెనర్జీ

-

ఈ రోజు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. వచ్చే ఎన్నికల్లో ఎటువంటి పరిస్థితుల్లో బీజేపీని అధికారంలోకి రానివ్వకుండా చేస్తామని చెప్పారు. వీలైతే బీజేపీకి ఎక్కడా కనీసం ఒక్క సీటు కూడా రాకుండా.. సున్నాకు పరిమితం చేయడానికి మేము విపక్షాలు అందరికతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అందులో భాగంగా కోల్కతా లో ఈ రోజు మమతా బెనర్జీ బీహార్ సీఎం నితీష్ కుమార్ ను మరియు డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ లతో భేటీ అయ్యారు.

ఈమె మాట్లాడుతూ అన్ని విపక్షాలను కలుపుకుంటూ వెళ్లి బీజేపీ పఠనం కోసం పనిచేస్తామన్నారు. మా మధ్యన వ్యక్తిగత స్వార్ధాలు మరియు అజెండాలు ఏమీ లేవని బీజేపీ ఓటమి మా ప్రధాన అజెండా అని బలంగా చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news