బేగంపేట్‌ మెట్రోస్టేషన్‌ పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

-

హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ పరిధిలోని.. బేగంపేట్ ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్ పై నుండి దూకి రాజు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే.. ఈ సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిన్న రాత్రి సమయంలో మెట్రో స్టేషన్ పై నుండి దూకడంతో రాజు అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి.

 

వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారు జామున రాజు మృతి చెందాడు. కుటుంబ కలహాల కారణంగానే రాజు ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు పోలీసులు. ఈ దారుణమైన సంఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు బేగంపేట్ పోలీసులు. నిజామాబాద్ కు చెందిన వ్యక్తిగా రాజును దర్యాప్తులో గుర్తించారు పోలీసులు. ఇక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి తరలించారు బేగంపేట పోలీసులు. ఇక సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. రాజు ఎలా చనిపోయాడో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news