బాలానగర్ ఫ్లైఓవర్ మీద నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

-

ఆత్మహత్యలు.. ఈమధ్య సర్వసాధారణం అయిపోతున్నాయి. చిన్నచిన్న కారణాలకే ప్రాణాలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు మందలించారని, ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యానని, లవ్ ఫెయిల్ అయిందని, ఆర్థిక కష్టాలు కలుగుతున్నాయని.. ఇలా ఏదైతేనేం నిండు జీవితాన్ని క్షణికావేశంలో బలి తీసుకుంటున్నారు. సూసైడ్ చేసుకోవడం తప్పని చెబుతున్నప్పటికీ.. వాటిని పట్టించుకోవడం లేదు. తాజాగా హైదరాబాదులో ఇలాంటి విషాద ఘటనే చోటుచేసుకుంది.

ఓ వ్యక్తి ఫ్లైఓవర్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి బాలానగర్ ఫ్లైఓవర్ మీదకు చేరుకున్నాడు. ఎవరు రావడంలేదని గమనించి ఫ్లైఓవర్ మీద నుంచి కిందకు దూకేశాడు. తీవ్ర గాయాలు కావడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనదారుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న బాలానగర్ పోలీసులు.. మృతదేహాన్ని గాందీ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news