మద్యం మత్తులో పెళ్లి మండపానికి వెళ్లడం మరిచిపోయిన వరుడు

-

మద్యం సేవించిన వాళ్లు సరైన స్పృహలో ఉండరని తెలుసు. మందు తాగి హల్​చల్ చేస్తారని తెలుసు. కానీ ఓ మందుబాబు పెళ్లికి ముందు మద్యం సేవించాడు. ఏకంగా తన పెళ్లికి వెళ్లాలనే విషయాన్నే మరిచిపోయాడు. పెళ్లి కుమారుడి కోసం వేచిచూస్తున్న వారంతా ఈ విషయం తెలిసి అవాక్కయ్యారు. చివరకు ఆ వధువు ఇచ్చిన షాక్​తో పెళ్లి కుమారుడికి దిమ్మతిరిగింది.

బిహార్‌ భాగల్‌పూర్‌ ప్రాంతానికి చెందిన మియాన్‌ అనే యువకుడికి సుల్తాన్‌గంజ్‌ గ్రామానికి చెందిన ఓ అమ్మాయితో పెళ్లి నిశ్చయించారు. మంగళవారం ఉదయం ముహూర్తాన్ని ఖరారు చేశారు. వివాహ మండపానికి చేరుకున్న వధువు వరుడి రాకకోసం ఎదురు చూసింది.

ముహూర్త సమయం దాటినా పెళ్లి కుమారుడు రాకపోయేసరికి వధువు కుటుంబీకులు ఆందోళన చెందారు. అతడు మధ్యాహ్నం సమయంలో మద్యం సేవించి పెళ్లి మండపానికి వచ్చాడు. ఇప్పుడే ఇలా ఉంటే పెళ్లైన తర్వాత ఇంకెలా ఉంటాడని వరుడి తల్లిదండ్రులను వధువు నిలదీసింది. ఇలాంటి వాడితో పెళ్లి వద్దంటూ తిరస్కరించింది. వధువు నిర్ణయాన్ని ఆమె తల్లిదండ్రులు కూడా అంగీకరించడంతో పెళ్లి క్యాన్సిల్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news