స్నేహితుడిని చంపి తలతో పోలీస్ స్టేషన్‌కు.. ఈ గొడవంతా రూ.500 కోసమే

-

అసోం రంగాపాడాలోని దయాల్‌పుర్‌ గ్రామంలో రూ.500 కోసం ఇద్దరు స్నేహితులు గొడవ పడ్డారు. ఈ గొడవ ఘర్షణకు దారి తీసి ఒకరి ప్రాణం బలితీసుకుంది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్నేహితుడిని చంపిన తర్వాత అతడి తల తీసుకుని నిందితుడు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.

దయాల్​పుర్​ గ్రామానికి చెందిన తునీరామ్​ మాద్రి.. బ్రోయిలర్​ హేమ్​రామ్​(55) తల నరికాడు. అనంతరం ఆ తల, కత్తి పట్టుకొని 10 కిలోమీటర్లు నడిచి పోలీస్​ స్టేషన్​లో లొంగిపోయాడు. హేమ్​రామ్​కు రూ. 500 అవసరమై మాద్రిని అడిగాడు. నిరాకరించిన మాద్రిని రామ్‌ బెదిరించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది.

కోపోద్రిక్తుడైన తునీరామ్​ మాద్రి ఆవేశంలో తన దగ్గర ఉన్న పదునైన కత్తితో హేమ్​రామ్​ మెడపై వేటు వేశాడు. ఆ తల పట్టుకొని పోలీస్​ స్టేషన్​కు చేరుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు

Read more RELATED
Recommended to you

Latest news