సోషల్ మీడియాలో ట్రోల్స్.. ఆ ఫొటో డిలీట్ చేసిన మంచు లక్ష్మీ

-

చాలా మంది సెలెబ్రిటీలు తమకు సంబంధించిన విషయాలు షేర్ చేసుకునే ఏకైక ప్లాట్ ఫామ్ సోషల్ మీడియా. ఫేసుబుక్, ట్విటర్, ఇన్ స్టాగ్రామ్ ఇలా మాధ్యమమేదైనా.. ఎల్లప్పుడు తమ ఫ్యాన్స్ కు దగ్గరగా ఉంటారు. కొన్నిసార్లు వారు షేర్ చేసుకునే విషయాలు కొంతమందికి నచ్చకపోవచ్చు. లేదా సెలెబ్రిటీలు తాము పోస్ట్ చేసినప్పుడు ఏవైనా తప్పిదాలు చేయొచ్చు. వీటిని కొందరు లైట్ తీసుకుంటారు. కానీ మరికొందరు మాత్రం అదే పనిగా ట్రోల్ చేస్తూ ఉంటారు.

అయితే కొందరు సెలెబ్రిటీలు మాత్రం ఈ ట్రోలింగ్ ని, తమపై వచ్చే మీమ్స్ ని ఎంజాయ్ చేస్తుంటాం అని చెబుతుంటారు. వారిలో మంచు వారసురాలు, మంచు లక్ష్మీ ఒకరు. ‘తనపై సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్ ను ఎంజాయ్ చేస్తూ ఉంటానని.. మనం ఏదో ఒక గొప్ప పని చేస్తే తప్ప మనల్ని ఎవరూ గుర్తించరు.. అలా నలుగురు నన్ను గుర్తిస్తున్నారు అంటే వాళ్లందరూ చేయలేని పనేదో నేను చేసే ఉంటాను అది నాకు నచ్చుతోంది. అందుకే నాపై వచ్చే ట్రోల్స్ ని నేను ఎంజాయ్ చేస్తుంటాను’ అని చాలాసార్లు చెప్పారు.

ఇలా ట్రోల్స్ ని స్పోర్టివ్ గా తీసుకునే మంచులక్ష్మీ బోనాల సందర్భంగా తాను పెట్టిన ఓ పోస్ట్ పై ట్రోలింగ్ జరగడంతో ఆ పోస్ట్ ని డిలీట్ చేశారు. బోనాల పండుగను పురస్కరించుకుని.. తాను గతంలో బతుకమ్మ పండుగ సందర్భంగా నెత్తిన బతుకమ్మను ఎత్తుకుని దిగిన ఫొటోను షేర్ చేశారు. ఇక అప్పటి నుంచి ‘బోనాలకు .. బతుకమ్మ పండుగకు తేడా తెలియడం లేదా, ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు ఒక్క ఫొటోతో ఇటు బోనాలు.. అటు బతుకమ్మ రెండు పండుగల విషెస్ చెప్పారంటూ’ కొందరు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈ ట్రోలింగ్ చూసి మంచు లక్ష్మీ ఆ పోస్ట్ ను డిలీట్ చేశారు. ట్విటర్, ఇన్ స్టాగ్రామ్ నుంచి ఫొటోలను.. పోస్టులను తొలగించారు.

Read more RELATED
Recommended to you

Latest news