”అలాయ్‌-బలాయ్‌” లో పవన్‌ కళ్యాణ్‌ నేను జోక్స్‌ చేసుకున్నాం – మంచు విష్ణు

-

అలాయ్‌-బలాయ్‌ కార్యక్రమంలో మంచు విష్ణు ను పవన్‌ కళ్యాణ్‌ పట్టించుకోలేదన్న వార్తలపై మంచు విష్ణు స్పందించారు. ఇవాళ ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, తాము అందరం ఫ్యామలీ స్నేహితులమని.. అలాయ్‌ – బలాయ్‌ స్టేజ్ ఎక్కక ముందే చాలా సేపు మాట్లాడుకున్నామని మంచు విష్ణు క్లారిటీ ఇచ్చారు.

తాను పవన్‌ కళ్యాణ్‌ స్టేజీ ఎక్కక ముందే జోక్స్‌ కూడా చేసుకున్నామని చెప్పారు మంచు విష్ణు. పవన్‌ కళ్యాణ్‌ ను ఒకటి అడిగాను.. ఆ విషయాన్ని తర్వాత చెబుతానని చెప్పారు.  ప్రకాశ్‌ రాజ్‌ హ్యాపీ గా సీసీటీవీ ఫుటేజ్‌ చూసు కోవచ్చని.. మంచు విష్ణు క్లారిటీ ఇచ్చారు. మేం ప్రజా స్వామ్య పద్ధతి లో గెలిచామని… తమకు ఎలాంటి భయం లేదన్నారు మంచు విష్ణు.

ప్రజా స్వామ్యం లో గెలుపు ఓటములు సర్వసాధారణమని… వెయ్యి శాతం వాళ్ళు సిసిటీవి పుటేజ్ చూసుకోవచ్చు… గెలిచింది తామేనని స్పష్టం చేశారు. అన్ని బహిరంగంగానే జరిగాయి …. మేము ఇద్దరు పేపర్ సపరెట్ చేశామన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓపన్ చేయక ముందే తాను గెలిచానని ప్రకాష్ రాజ్ చెప్పుకున్నారని చురకలు అంటించారు.

Read more RELATED
Recommended to you

Latest news