పవన్ కళ్యాణ్ వీడియో ను షేర్ చేసిన మంచు విష్ణు !

-

తెలంగాణ రాష్ట్రంలో అలయ్ బలాయి కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా… గవర్నర్ బండారు దత్తాత్రేయ… సికింద్రాబాద్ ప్రాంతంలో నిర్వహిస్తారు. దసరా పండుగ జరిగిన తర్వాత ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు బండారు దత్తాత్రేయ. ఇందులో భాగంగానే ఇవాళ జలవిహార్ లో అలయ్ బలాయ్ కార్యక్రమాన్ని నిర్వహించారు బండారు దత్తాత్రేయ మరియు ఆయన కుమార్తె విజయ లక్ష్మి.

అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దేశ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యులు కిషన్ రెడ్డి మరియు తెలంగాణ హోం శాఖ మంత్రి మహమ్మద్ అలీ, తెలంగాణ గవర్నర్ తమిళ సై తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు పవన్ కళ్యాణ్ మరియు మంచు విష్ణు కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

అయితే ఈ నేపథ్యంలోనే.. పవన్కళ్యాణ్ ఈ కార్యక్రమానికి హాజరైన ఓ వీడియో క్లిప్ ను మంచు విష్ణు షేర్ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు తాను కూడా అలయ్ బలాయి కార్యక్రమానికి హాజరు అవుతున్నట్లు అర్థం వచ్చేలా ఆ వీడియోను షేర్ చేశారు మంచు విష్ణు. అయితే.. దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. మా ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు అయిన నాలుగు రోజులకే… పవన్ కళ్యాణ్ తో పాటు కూర్చునే స్థాయికి ఎదిగావంటు కొందరు పొగుడుతున్నారు. ఇక మరికొందరేమో… పదవిలో వారం రోజులు కూడా ఉండేలా కనబడటం లేదంటూ మంచు విష్ణు చురకలంటించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news