మంగళసూత్రం కూడా అమ్ముకోవాల్సి వచ్చింది.. సుధ..!

-

ప్రముఖ సీనియర్ నటి సుధా గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. సుమారు 1000 సినిమాలలో నటించి అమ్మ, అత్త, అక్క లాంటి ఎన్నో పాత్రలు చేస్తూనే.. మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ప్రముఖ డైరెక్టర్ బాలచందర్ సలహా మేరకు క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి ఇండస్ట్రీలో ఇప్పటికీ తన హవా కొనసాగిస్తూ వస్తుంది. వరుస సినిమాలు చేస్తూ.. కోట్ల రూపాయలు కూడబెట్టిన ఈమె ఆ తర్వాత తండ్రి, కొడుకు మోసం చేయడంతో పూర్తిగా నష్టపోయాను అని అలాగే నమ్మిన వాళ్లకు ఇచ్చి భారీగా నష్టపోయాను అని కూడా తెలిపింది.

సినీ జీవితంలో ఉన్నతంగా బ్రతికాను.. వ్యక్తిగత జీవితంలో మాత్రం పూర్తిగా నష్టపోయాను. నేను పుట్టడమే ధనవంతుల ఇంటిలో పుట్టాను. బంగారం కూడా కాదు.. డైమండ్ స్పూన్ తోనే పుట్టాను. పెద్ద ఇల్లు.. ఇంటి నిండా పనివాళ్ళు.. ముగ్గురు డ్రైవర్లు.. మహారాణిలా బ్రతికాను. కానీ కళ్ళముందే ఐశ్వర్యం అంతా కరిగిపోయింది. ఒకానొక సందర్భంలో కడుపు నింపుకోవడం కోసం తాళిబొట్టు కూడా అమ్ముకున్నాము. అలా జీవితంలో ఎంతో వైభోగం అనుభవించి చివరికి తినడానికి తిండి కూడా లేని స్థితికి వచ్చాము అని చెప్పుకొచ్చింది.

ఇక తన భర్త గురించి చెబుతూ.. ఢిల్లీలో బిజినెస్ మేనేజ్మెంట్ చేసి పూర్తిగా నష్టపోయాను. అక్కడ హోటల్ ప్రారంభించడంతో మళ్లీ ఉన్న డబ్బు అంతా పోయింది. ఒక్క సంతకంతో వందల కోట్లు నష్టపోయాను. కొన్ని అప్పులను కూడా ఈ మధ్యకాలంలోనే తీర్చాను. నా భర్త కూడా మోసం చేసి వెళ్లిపోయాడు. నా కొడుకు విదేశీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అక్కడే సెటిల్ అయిపోయాడు. ఇప్పటివరకు నాకి ఫోన్ కూడా చేయలేదు అంటూ చెప్పుకుంటూ ఎమోషనల్ అయింది సుధా.

Read more RELATED
Recommended to you

Latest news