కవిటి మండలంలో విషాదం.. 40 కోతులు మృతి

-

శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలో విషాదం చోటుచేసుకుంది. శిలాగం గ్రామ సమీపంలోని రహదారిపై 40 కోతుల మృతదేహాలు కనిపించడం కలకలం రేపింది. రోడ్డు పక్కన తోటలో అపస్మారక స్థితిలో మరికొన్ని కోతులు పడి ఉన్నాయి. అపస్మారక స్థితిలో ఉన్న కోతులకు స్థానికులు బిస్కెట్లు, రొట్టెలు, నీళ్లు అందించారు.

కోతులపై విషప్రయోగం జరిగిందా? లేక విద్యుదాఘాతంతో మృతి చెందాయా? అని స్థానికులు అనుమానిస్తున్నారు. ఘటన గురించి అటవీ శాఖ అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కోతుల మృతదేహాలను పరిశీలించిన తర్వాత మరణానికి గల కారణాలు తెలుస్తాయని చెప్పారు. ఎవరైనా కోతులపై విషప్రయోగం చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news