ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకుడు

-

మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు ఓ కాంగ్రెస్ నాయకుడు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో దోనిపాముల గ్రామంలో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రసమయి బాలకిషన్ ఆ గ్రామానికి రెండు కోట్లు తెచ్చి అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. అయితే బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉండి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బెజ్జంకి మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి.

ప్రజలకు తప్పుడు హామీలతో ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. రసమయి బాలకిషన్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news