వింత ఆచారం.. శ్మశానంలో దీపావళి సంబురాలు.. ఎక్కడంటే..?

-

దేశవ్యాప్తంగా దీపావళి సంబురాలు అంబరాన్నంటాయి. అందరూ తమ కుటుంబాలతో హాయిగా ఆనందంగా వేడుకలు జరుపుకున్నారు. కానీ కరీంనగర్ లో మాత్రం కొందరు శ్మశానంలో దీపావళి వేడుకలు నిర్వహించారు. గత ఆరు దశాబ్ధాల నుంచి శ్మశాన వాటికలో దీపావళి జరుపుకునే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు ఈ నగర వాసులు.

తమ పూర్వీకులను స్మరించుకుంటూ కుటుంబ సభ్యులను సమాధి చేసిన ప్రదేశంలో దీపాలు వెలిగించి వేడుక చేసుకోవటం ఒక ఆచారంగా నిర్వహిస్తారు. కరీంనగర్‌ కార్ఖానగడ్డ హిందూ శ్మశాన వాటికలో ప్రతి సంవత్సరం ఎస్సీ కుటుంబాలు శ్మశాన వాటికలో చనిపోయిన తమ బంధువుల సమాధుల వద్ద దీపావళి పండుగ జరుపుకుంటారు. పండగకు వారం రోజుల ముందు శ్మశానవాటికను శుభ్రం చేసి సమాధులకు రంగులు వేస్తారు.

కుటుంబ సభ్యులందరూ సమాధుల వద్దకు వెళ్లి పూలతో సమాధులను అలంకరిస్తారు. పండుగ రోజు  సాయంత్రం వారంతా అక్కడే గడుపుతారు. నైవేద్యాలు పెట్టి తమ పెద్దలను స్మరించుకుంటూ దీపావళి వేడుకలు జరుపుకుంటారు. తమ పూర్వీకులు తమ మధ్యలో లేకపోయినా ఆ లోపం కనపడకుండా ఉండేందుకు పండుగ రోజు కుటుంబ సభ్యులంతా శ్మశానానికి వస్తుంటామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news