BREAKING : ఏపీలో భారీ పేలుడు..ఓ వ్యక్తి మృతి

-

BREAKING : ఏపీలో భారీ పేలుడు చోటు చేసుకుంది. దీంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఏలూరు జిల్లా లో చెత్త లో పేలుడుతో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఆగిరిపల్లి మండలం వడ్లమాను సమీపంలోని తాడేపల్లి శివారు హ్యాపీ వ్యాలీ స్కూల్ ప్రహరీ గోడ పక్కన ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ ప్రమాద ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇక గాయపడిన వారిని నూజివీడు ఆసుపత్రికి తరలించారు స్థానికులు.

ఇక దుర్గాప్రసాద్ చికిత్స పొందుతూ మృతి చెందగా, శాంతల మణికి స్వల్ప గాయాలు అయ్యాయి. భయంకర శబ్దంతో ప్రేలుడు చోటు చేసుకుందని…చెత్తకు నిప్పంటించగా కెమికల్ తో కూడిన వ్యర్థపదార్థాలు ఉన్నట్లు గుర్తించారు స్థానికులు. ఇక సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు…..దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news