నాగబాబు సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ట్వీట్

-

మెగా హీరోల్లో నాగబాబుకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన ఎప్పుడూ ఏదో ఒక అంశంపై మాట్లాడుతూ.. వివాదంగా మారుతారు. అప్పట్లో మా ఎన్నికలు, అలాగే ఏపీ రాజకీయాలపై వ్యాఖ్యలు చేస్తూ.. హాట్‌ టాపిక్‌ గా మారారు. అయితే.. అయితే తాజాగా నాగబాబు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నాగబాబు పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఒక పక్క సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తూ… మరోపక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన లో కొనసాగుతున్నారు. తాజాగా ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది.

బాటసారి ప్రయాణం కొనసాగుతోంది అంటూ పెట్టిన ఈ పోస్టు మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులలో ఎన్నో అనుమానాలకు దారితీస్తోంది. “ఎన్నో ఒడిదుడుకులను చూసి, ఎన్నో విపత్తులు ఎదుర్కొని నన్ను నేనుగా మార్చుకోగలిగాను, ఒకరకంగా చూస్తే ఆ ఆపదలు, కష్టాలే నన్ను ఒక పూర్తి మనిషిగా మలిచాయి. త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోబోతున్న” అంటూ నాగబాబు సంచలన పోస్టు పెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news