‘రంగరంగ వైభవంగా’ ప్రీ రిలీజ్ కోసం మెగా హీరోలు

-

మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం ‘ఉప్పెన’తోనే చక్కటి విజయాన్ని అందుకున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫిల్మ్ లో వైష్ణవ్ తేజ్ పర్ఫార్మెన్స్ కు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత విడుదలైన ‘కొండ పొలం’ మూవీకి మంచి టాక్ వచ్చింది. కానీ, బాక్సాఫీసు వద్ద అనుకున్న స్థాయిలో ఆడలేదు.

ఈ క్రమంలోనే పంజా వైష్ణవ్ తేజ్ మూడో చిత్రం కొత్త దర్శకుడు గిరీశయ్యతో చేస్తుండగా ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఢిల్లీ భామ కేతిక ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుండగా, డిఫరెంట్ లవ్ స్టోరిగా ఈ సినిమా ఉండబోతున్నదని తెలుస్తోంది. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్ పీ బ్యానర్ పై బీవీఎస్ ఎన్ ప్రసాద్ ఈ పిక్చర్ ను ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ఈ చిత్రం నుంచి విడుదలైన రొమాంటిక్ పోస్టర్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అయితే.. తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కు ముహుర్తం ఖరారు అయింది. ఈ ఈవెంట్ ఇవాళ సాయంత్రం.. పార్క్‌ హయాత్‌ హోటల్‌ లో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సాయితేజ, వరుణ్‌ తేజ్‌ ముఖ్య అతిధిలుగా హాజరుకానున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news