ప్రధాని మోడీపై కాంగ్రెస్ మహిళా నేత వివాదాస్పద వ్యాఖ్యలు

-

ప్రధాని మోడీపై రాజస్థాన్ కాంగ్రెస్ మహిళా నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఝున్‌ఝునా జిల్లా సుల్తానాలో శనివారం జరిగిన ఓ ర్యాలీలో మహిళా కాంగ్రెస్ నేత ఇంద్రా డూడీ మాట్లాడిన మాటలు తీవ్ర దుమారం రేపాయి. రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. భారత దేశంలో ముస్లింల జనాభా హిందువుల జనాభాతో సమానంగా ఉంటే.. ప్రధాని మోడీ కూడా రోజుకు ఏడు సార్లు నమాజ్ చేసేవాడని ఇంద్రా డూడీ చెప్పారు.

modi-namaz
modi-namaz

బీజేపీ ప్రభుత్వం దేశంలో మత రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. విభజన రాజకీయాలకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంద్రా డూడీ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు రాజస్థాన్ రవాణా శాఖ మంత్రి బిజేంద్ర ఓలా కూడా ఉన్నారు. ఇంద్రా డూడీ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news