మెగా డాటర్ నిహారిక భర్త కేసులో రాజీ

-

హైదరాబాద్: మెగా డాటర్ నిహారిక భర్త కేసులో పోలీసులు రాజీ కుదర్చారు. హారిక ఇంట్లో నిన్న అర్థరాత్రి తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. నిహారిక భర్త వెంకట చైతన్య ఇంట్లో నానా రచ్చ చేశారు. ఇంట్లో చేయడమే కాకుండా.. తోటి అపార్ట్‌ మెంట్‌ వాసులకు ఇబ్బంది కలిగేలా చేశారు.

దీంతో నిహారిక భర్త వెంకట చైతన్య న్యూసెన్స్ చేస్తున్నాడని అపార్ట్‌మెంట్ వాసులు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేశారు. అటు అపార్ట్ మెంట్ వాసులపై కూడా నిహారిక భర్త చైతన్య ఫిర్యాదు చేశారు. దీంతో వీరి పరస్పరం ఫిర్యాదులపై పోలీసులు విచారణ చేపట్టారు. ఇరు పక్షాలను పోలీస్ స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో ఇరువర్గాలు రాజీ కుదుర్చుకున్నాయి.

 

కాగా మెగా ఫ్యామిలీ నుంచి తొలి హీరోయిన్‌‌గా నిహారిక… టాలీవుడ్‌ పరిశ్రమకు పరిచయమయ్యారు. ఆ తర్వాత సినిమాలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టారు. అయితే పలు టీవీ షోలలో కనిపంచారు. ఈ నేపథ్యంలోనే నిహారికకు.. గుంటూరు రేంజ్‌ ఐజీ జొన్నల గడ్డ ప్రభాకర్‌ రావు కుమారుడు.. ప్రముఖ వ్యాపార వేత్త వెంకట చైతన్యతో వివాహం జరిగింది. గత డిసెంబర్‌ మాసంలో రాజస్థాన్‌ లో వీరి పెళ్లి చాలా గ్రాండ్‌‌గా జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news