సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ‘మేరా ఘర్ ఆప్‌కా ఘర్’

-

రాహుల్ గాంధీని బంగ్లా ఖాళీ చేయాలంటూ లోక్ సభ హౌసింగ్ కమిటీ నోటీసులు జారీ చేయడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ ఇంటికి రావాలని రాహులను ఆహ్వానిస్తున్నారు.

‘మేరా ఘర్ ఆప్ కా ఘర్’ అంటూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ‘రాహుల్ భయ్యా, నా ఇల్లు… మీ ఇల్లు. నా ఇంటికి వచ్చేయాలని మీకు స్వాగతం పలుకుతున్నాను. మనమంతా ఒక కుటుంబం’ అని ట్వీట్ చేశారు.

కాగా.. అనర్హత వేటుకు గురైన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి తన అధికారిక బంగ్లాను ఖాళీ చేయాల్సిందిగా నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని తుగ్లక్ లైన్ – 12 లో ప్రభుత్వం కేటాయించిన బంగ్లాను ఏప్రిల్ 22 లోగా ఖాళీ చేయాలని సోమవారం సాయంత్రం నోటీసులు జారీ చేశారు. లోక్సభ హౌసింగ్ కమిటీ ఈ నోటీసులను జారీ చేసింది. నిబంధనల ప్రకారం అనర్హుడైన పార్లమెంటేరియన్ ప్రభుత్వ వసతికి అర్హులు కారని నోటీసులలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news