BREAKING : సమ్మెకు దిగిన మెట్రో ఉద్యోగులు..హైదరాబాద్ లో నిలిచిపోయిన మెట్రో సేవలు

-

హైదరాబాద్‌ ప్రయాణికులకు బిగ్‌ షాక్‌ తగిలింది. హైదరాబాద్‌ మెట్రో ఉద్యోగులు..సమ్మెకు దిగారు. ఉన్నఫలంగా హైదరాబాద్‌ మెట్రో ఉద్యోగులు..సమ్మెకు దిగారు. తమకు జీతాలు పెంచాలని మెట్రో ఉద్యోగులు సమ్మె దిగారు.

అయితే, దీనిపై మెట్రో యాజమాన్యం స్పందించకపోవడంతో, హైదరాబాద్‌ మెట్రోకి సమ్మె ఎఫెక్ట్ పడింది. సమ్మెలో భాగంగా విధులు బహిష్కరించారు మెట్రో టికెటింగ్‌ ఉద్యోగులు. దీంతో మియాపూర్‌-ఎల్బీనగర్‌ మెట్రో స్టేషన్లలో స్తంభించింది టికెట్‌ వ్యవస్థ. ఈ నేపథ్యంలోనే, హైదరాబాద్‌ ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మెట్రో ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version