సిరియాలో విషాదం.. పడవ బోల్తా పడి 15 మంది దుర్మరణం

-

సిరియాలో విషాదం చోటుచేసుకుంది. లెబనాన్​ నుంచి ఐరోపాకు వలసదారులతో బయలుదేరిన ఓ పడవ గురువారం బోల్తా పడింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పడవ బోల్తా పడిన ఘటనలో 15 మంది మృతి చెందారు. మరికొందరు ప్రాణాలతో బయటపడ్డారు.

అయితే నీట మునిగిన 15 మంది మృతదేహాలను వెలికితీశామని అధికారులు తెలిపారు. పడవలో మొత్తం ఎంత మంది ఉన్నారో స్పష్టంగా తెలియరాలేదని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news