ఓరి దేవుడా..పెన్ను ఖరీదు అన్ని లక్షలా?

-

సాదారణంగా పెన్నులను ఎందుకు వాడతారు ఏదైనా రాసుకోవడానికి, అదే పిల్లలు అయితే చదువుకు సంబంధించిన విషయాలను పుస్తకాల్లో రాస్తారు.ఆ పెన్నుల ఖరీదు 5 రూపాయలు, లేదా 10 రూపాయలు ఉండటం మనం చూసే ఉంటాము..అంతకన్నా ఎక్కువ అంటే 100 లేక 200 ల రూపాయలు ఉంటుంది. అంతే కానీ, వేలు, లక్షలు అయితే ఉండదు..లక్ష రూపాయలు పెన్ను కోసం పేట్టేవాడు మూర్ఖుడు అయ్యి ఉంటాడు.ఎంత బిల్ గెట్ అయిన లక్షల్లో విలువ చేసే పెన్నులను వాడరు.

 

విషయాన్నికొస్తే..రాజస్థాన్‌లోని జైపూర్‌ అంతర్జాతీయ జమ్ జ్యువెలరీ షో ఈసారి ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. ఎగ్జిబిషన్‌లో రూ.11 లక్షల విలువైన పెన్ను ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.చూడటానికి వీణ ఆకారంలో ఉండే ఈ పెన్ను 22 క్యారెట్ల బంగారంతో మార్గనైట్ రాయి, బర్మీస్ టూర్మాలిన్స్, డైమండ్, ఎమరాల్డ్ పూసలతో తీర్చిదిద్దారు. ఇందులో నెమలి ఆకారాన్ని జాతిరాళ్లతో తయారు చేశారు..

ఈ నెల 12 వరకు జరిగిన ఎగ్జిబిషన్‌లో 48 దేశాల నుంచి 8000 మందికి పైగా కొనుగోలుదారులు వచ్చారు. 500 మందికి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ షోలో ఖరీదైన నగలను ప్రదర్శించారు. ఇందులో కొలంబియా ఎమరాల్డ్ ఆభరణాలు చూపరులను బాగా ఆకట్టుకున్నాయి.అంతే కాదు 11 లక్షల విలువ చేసే బంగారపు పెన్ను కూడా అందరినీ ఆకర్షించింది. దాన్ని చూసేందుకు జనం క్యూ కట్టారు.మొత్తానికి ఆ పెన్ను ఇప్పుడు అందరి నోట్లో నానుతుంది..

Read more RELATED
Recommended to you

Latest news