నకిలీ సర్టిఫికెట్ల జారీ వెనక ఎంఐఎం పార్టీ ఉంటుంది – రాజాసింగ్

-

గ్రేటర్ హైదరాబాద్ బల్దియాలో వెలుగులోకి వచ్చిన నకిలీ బర్త్ సర్టిఫికెట్ వ్యవహారంలో ఎంఐఎం పార్టీ పాత్ర ఉంటుందని ఆరోపించారు బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్. నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నకిలీ సర్టిఫికెట్లు తయారు చేయడం వారికి ముందు నుండే అలవాటు అని, దీని వెనుక పెద్ద కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు.

బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు, టెర్రరిస్టులు, స్లీపర్ సెల్స్ కోసమే ఈ నకిలీ సర్టిఫికెట్ లని తయారు చేశారని ఆరోపించారు. మేము తెలంగాణ వాళ్ళమని చెప్పుకోవడం కోసమే, భారతీయులమని నిరూపించుకునేందుకే ఈ సర్టిఫికెట్లను తయారు చేశారని సంచలన ఆరోపణలు చేశారు. పాతబస్తీలోనే ఇటువంటి బర్త్ సర్టిఫికెట్లు 27 వేల వరకు ఉన్నాయని, ఎంఐఎం నేతలు దగ్గరుండి ప్రోత్సహించారని ఆరోపించారు. బర్త్, డెత్ సర్టిఫికెట్లు మాత్రమే కాకుండా.. ఓటర్ కార్డులు, రేషన్ కార్డులు కూడా తనిఖీ చేయాలని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news