పసుపు బోర్డు ఇచ్చామని బీజేపీ ఓట్లు అడుగుతోంది : కేటీఆర్‌

-

ప్రధాని మోడీ ఇటీవల పాలమూరు బీజేపీ బహిరంగ సభ వేదికగా తెలంగాణలో పసుసు బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో తాజా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప‌సుపు బోర్డ్ ఇచ్చాం కాబట్టి తమకు ఓటు వేయాల‌ని బీజేపీ చెబుతోందని, పొర‌పాటున కూడా ఆ పార్టీకి ఓటు వేయవద్దని అన్నారు. బీజేపీ దొంగ పార్టీ, మ‌త‌పిచ్చి పార్టీ, హిందూ-ముస్లిం పంచాయితీలు త‌ప్పా ఇంకో ప‌థ‌కం, ప‌నికొచ్చే ప‌ని చేయ‌డం లేదని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ప్ర‌జ‌ల కోసం, పేద‌ల కోసం ఆలోచించడం లేదన్నారు కేటీఆర్. సంవ‌త్స‌రానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాన‌ని చెప్పిన మోదీ ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వ‌లేదన్నారు కేటీఆర్.

KTR seeks action against Bandi Sanjay for denigrating KCR

జాతిపిత మ‌హాత్మాగాంధీని చంపిన మొట్ట‌మొద‌టి టెర్ర‌రిస్ట్ గాడ్సే అన్నారు. గాడ్సేను ఆరాధించే పార్టీ మ‌నకు అవ‌స‌ర‌మా? అని
ప్రశ్నించారు. ఇలాంటి బీజేపీతో పొత్తు పెట్టుకునే ఖర్మ తమకు లేదన్నారు. ఆర్ఎస్ఎస్ నుంచి వ‌చ్చిన వ్య‌క్తిని, ఓటుకు నోటు దొంగ‌ను ఇవాళ పార్టీ ప్రెసిడెంట్‌గా పెట్టుకున్న న‌క్క‌జిత్తుల కాంగ్రెస్ ఎన్ని మాట‌లు మాట్లాడినా నమ్మవద్దన్నారు. బీజేపీకి, బీఆర్ఎస్‌కు సంబంధం ఉంద‌ని ఇవాళ చాలామంది అంటున్నారని, కానీ మోదీని కేసీఆర్ విమర్శించినంతగా ఎవరూ విమర్శించడం లేదన్నారు. మోదీ ఏం చేశాడని ఆయ‌న‌తో తాము అంటకాగుతామని ప్రశ్నించారు. మోదీ దేవుడ‌ని బండి సంజ‌య్ చెబుతున్నారని, సిలిండ‌ర్ ధ‌ర‌, పెట్రోల్, నిత్యాస‌వ‌రాలు పెంచినందుకా మోదీ దేవుడు? అని ప్ర‌శ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news