నడిరోడ్డుపై చిందేసిన మంత్రి మల్లారెడ్డి!

-

మునుగోడు నియోజకవర్గంలో నేడు జరగనున్న ప్రజా దీవెన సభ కోసం సీఎం కేసీఆర్ బయలుదేరారు. సీఎం కాన్వాయ్ ప్రగతి భవన్ నుంచి బయలుదేరింది. ముందుగా అనుకున్నట్టే సీఎం రోడ్డు మార్గాన ప్రత్యేక బస్సులో మునుగోడుకు వెళ్తున్నారు. కెసిఆర్ తో పాటు మంత్రులు, నాయకులు పెద్ద సంఖ్యలో తరిలి వెళ్తున్నారు. హైదరాబాద్ నుంచి మునుగోడు వరకు ఐదు వేలకు పైగా కార్లలో భారీ ర్యాలీ నిర్వహిస్తూ.. సీఎం కాన్వాయ్ ని అనుసరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మునుగోడుకు వెళుతున్న క్రమంలో మంత్రి మల్లారెడ్డి నడిరోడ్డుపై డాన్స్ హైలెట్ ఆఫ్ ది డే గా చెప్పుకోవచ్చు.

తన కాన్వాయ్ లో వస్తున్న మల్లారెడ్డి ఓపెన్ టాప్ లో కారులో నిల్చోని ఊర మాస్ డాన్స్ స్టెప్పులు వేశారు. ఆయన డాన్స్ చేయడంతో అక్కడున్న టిఆర్ఎస్ కార్యకర్తల్లో మరింత జోష్ పెరిగింది. వారు కూడా స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news