రూటు మార్చిన మంత్రి నాని..సోషల్‌ మీడియాలో ట్రోల్‌ !

-

మంత్రి నాని సడన్ గా రూటు మార్చేశారట. హంగులు ఆర్భాటాలకు దూరంగా ఉండటం.. జనాలతో కలిసి మెలిసి తిరగడంపై ప్రజల్లోనూ.. పార్టీలోనూ కొత్త చర్చ మొదలైందట. మచిలీపట్నం నుంచి ఐదుసార్లు పోటీ చేసిన పేర్ని నాని ప్రస్తుతం ఏపీ రవాణా,సమాచారశాఖ మంత్రి గా ఉన్నారు. అధికార దర్పం ప్రదర్శించకుండా సామాన్యుడిలా ఉంటున్న మంత్రి పై సోషల్ మీడియాలోనూ కొత్త చర్చ నడుస్తుందట..

మచిలీపట్నం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాని తీరు మొదటి నుంచి కాస్తా డిఫరెంట్ గానే ఉందట..రిక్షాలో అసెంబ్లీకి వెళ్లడం.. మచిలీపట్నం నుంచి రైలు వేస్తే ఆ రైల్లోనే మచిలీపట్నం నుంచి ప్రయాణించటం ఆయనకే చెల్లింది. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన ఇలాంటి పనులు పెద్ద చర్చనీయాంశం అవ్వలేదు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేనే కాదు మంత్రి. అయినా ఆయన వ్యవహార శైలిలో మార్పు రాలేదు. ఇది ఆయన నిర్వహిస్తోన్న శాఖ అధికారులకు కూడా కాస్త ఇబ్బందిగా మారిందట.

సాధారణంగా ప్రభుత్వానికి సంబంధించి అన్ని వివరాలను మీడియాకు అందించే కీలకమైన శాఖ ఐ అండ్ పీఆర్. అలాంటి శాఖకు మంత్రిగా ఉన్న పేర్ని నాని ఇప్పటికీ తనదైన శైలిలో నియోజకవర్గ పర్యటనలు చేయటం ఆ శాఖ అధికారులకు టెన్షన్ పుట్టిస్తోందట. మచిలీపట్నంలోనే మంత్రి నివాసం, క్యాంప్‌ ఆఫీసు ఉన్నాయి. ఇక్కడ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఎదురుగా తెలిసిన వారు ఎవరు కనిపిస్తే వారి బైక్‌ ఎక్కి వెళ్లిపోతారు. నియోజకవర్గంలో పర్యటనకు వెళ్లాలన్నా అనుచరుల వాహనంలో ప్రయాణిస్తారు. కొన్నిసార్లు ఆటోలో వెళ్లిన సందర్భాలు ఉన్నాయి.

పర్యటనల సమయంలో ఏ వాహనం కనిపిస్తే దానిని నడుపుతారు పేర్ని నాని. ప్రొక్లయిన్‌, ట్రాక్టర్‌ సైతం తిప్పేశారు. పార తీసుకుని రోడ్డు పనిచేయడం.. హోంగార్డులతో కలిసి భోజనం చేయడం..ఇలా అప్పటికప్పుడు నిర్ణయం తీసేసుకుంటారు నాని. మంత్రి ఇలా చేసిన కాసేపటికి ఆ దృశ్యాలు ఏదో ఒక వాట్సాప్‌ గ్రూపులోనో, సోషల్‌ మీడియాలోనో కనిపిస్తాయి. వాటిని చూసి ఐ అండ్‌ పీఆర్‌ అధికారులు అవాక్కవుతున్నారు. మంత్రి వెంటే ఉంటోన్న గమనించలేకపోతున్నారట. అమాత్యుల వారు ఏ సమయంలో ఏం చేస్తారో.. వాటిని క్యాచ్ చేయగలమో లేమో అంటూ నిత్యం టెన్షన్ పడుతున్నారట అధికారులు, మంత్రిగారి సిబ్బంది.

గత ఎన్నికల్లో రెండుసార్లు ఓడిపోవడం నానికి నచ్చలేదట. జనంలో కలిసి ఉన్నా అప్పట్లో దూరం పెట్టడం ఎందుకో అర్థంకాని నాని రూటు మార్చేశారు. సామాన్యుడిగా కంటే అతి సామాన్యుడిగా మారిపోయారట. వచ్చిన వాళ్లందరినీ పలకరిస్తూ వారి సమస్యలు వింటున్నారట. మరి మంత్రి స్ట్రాటజీ జనానికి అర్థం అవుతుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news