కుప్పంలో తమిళ యాక్టర్ విశాల్ పోటీపై మంత్రి పెద్దిరెడ్డి క్లారిటీ

-

చిత్తూరు జిల్లా పలమనేరు లో వైఎస్ఆర్ సీపీ ప్లీనరీ సమావేశంలో పాల్గొన్నారు మంత్రి పెద్దిరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి సంబంధించి 2024లో వైసీపీ తరపున పోటీ చేసే అభ్యర్థి పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టత ఇచ్చారు. 2024లో కుప్పం నుంచి భరత్ పోటీ చేస్తాడని, ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదని ఆయన తేల్చి చెప్పారు.

కుప్పంలో చంద్రబాబు పై వైసీపీ అభ్యర్థిగా తమిళ్ యాక్టర్ ని బరిలోకి దింపితుందని ఎల్లో మీడియా తప్పుడు వార్తలు రాస్తోందని పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024లో కుప్పం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసేది భరత్ మాత్రమేనని ఆయన తెలిపారు. గతంలో పలమనేరులో తాము గెలిపించిన నేత వేరే పార్టీ లోకి వెళ్లారు అంటూ మాజీ మంత్రి అమర్ నాథ్ పై ఆయన విమర్శలు గుప్పించారు. దానికి ప్రతిగా పలమనేరు ప్రజలు ఆ మాజీమంత్రి కి తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. 2024లో మాజీ మంత్రి ని ఓడించిన వెంకట్ గౌడ్ నే పలమనేరు బరిలో నిలుపుతామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news