రాబోయే ఎన్నికల్లో దిక్కులు పిక్కటిల్లేలా జగన్ గెలుపు ఉండబోతుంది – మంత్రి రజని

-

రాబోయే ఎన్నికల్లో దిక్కులు పిక్కటిల్లేలా జగన్ గెలుపు ఉండబోతుందన్నారు మంత్రి విడదల రజని. చంద్ర బాబు హయాంలో ఆరోగ్య రంగాన్ని అమ్మకానికి పెట్టాడు…ఆరోగ్య శ్రీ నీ అనారోగ్య శ్రీ గా మార్చేశాడని ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు హయాంలో వైద్య రంగానికి ఏం చేశాడో చెప్పాలి…చంద్ర బాబు నలుగురు ఎమ్మెల్యే లను కొనగలడు కానీ, జగనన్న కోసం ప్రాణాలు ఇచ్చే నాలుగు కోట్ల మంది ప్రజలను మాత్రం కొనలేడని విమర్శలు చేశారు.

ఒక సాధారణ మహిళ నైన నాకు ఎమ్మెల్యే గా మంత్రిగా అవకాశం ఇచ్చిన జగనన్న కు జీవితాంతం రుణపడి ఉంటాను…వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్య శ్రీ ద్వారా వైద్య రంగం లో చరిత్ర సృష్టించారన్నారు. మళ్ళీ ఇప్పుడు జగన్ ఫ్యామిలీ డాక్టర్ విధానం తో తండ్రికి తగ్గ తనయుడు గా చరిత్ర సృష్టిస్తున్నారు…వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత అధికారం లోకి వచ్చిన ఏ నాయకుడు ప్రజా ఆరోగ్యం పై దృష్టి పెట్టలేదని తెలిపారు. మహా నగరాల్లో ధనవంతులకు మాత్రమే ఫ్యామిలీ డాక్టర్స్ ఉంటారు..
కానీ సీఎం జగన్ ఆలోచన విధానం తో మన రాష్ట్రం లో ప్రతి పేద కుటుంబానికి ఫ్యామిలీ డాక్టర్ నీ ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news