కుప్పంలో చంద్రబాబు కూసాలు కదులుతున్నాయి – మంత్రి రోజా

-

టిడిపి అధినేత నారా చంద్రబాబుపై సెటైర్లు వేశారు మంత్రి రోజా. కుప్పంలో చంద్రబాబు కూసాలు కదిలిపోతున్నాయని ఎద్దేవా చేశారు. దీంతో ఆయన కుప్పంలో వీధి రౌడీ లాగా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ నోటికి ప్లాస్టర్ వేసుకుంటాడని.. కుప్పంలో 8 మంది, గుంటూరులో ముగ్గురు చనిపోతే పవన్ కళ్యాణ్ కు కనపడలేదా? అని ప్రశ్నించారు.

టిడిపి, జనసేన సైకో పార్టీలని మండిపడ్డారు. దేశంలోనే పొలిటికల్ సైకో చంద్రబాబు అని విమర్శించారు మంత్రి రోజా. ఆయన ఓ శవాల నాయుడు అంటూ దుయ్యబట్టారు. కుప్పం స్థానిక సంస్థల ఎన్నికలలో ఈడ్చి తంతే చంద్రబాబు హైదరాబాదులో పడ్డాడని అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ సొంత జిల్లా, సొంత నియోజకవర్గంలోనే ప్రజలు ఓడించారని అన్నారు. పవన్ కళ్యాణ్ కి ప్రజలే రాజకీయ సమాధి కడతారని అన్నారు మంత్రి రోజా.

Read more RELATED
Recommended to you

Latest news