సోదరుని ఇంట రక్షాబంధన్ వేడుకల్లో మంత్రి సబితా

-

రాఖీ పౌర్ణమి సందర్భంగా తన సోదరుడు నరసింహారెడ్డి ఇంటికి వెళ్లి రాఖీ కట్టారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. సోదర, సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి రాఖీ పండుగ ప్రత్యేకగా నిలుస్తోందని మంత్రి పేర్కొన్నారు. అక్క – తమ్ముళ్ల, అన్న – చెల్లెల్ల వెలకట్టలేని ప్రేమానురాగాలు, ఆప్యాయతలకు ఈ పండుగ నిదర్శనంగా నిలుస్తోందని అన్నారు.

ప్రతి ఇంటా సంతోషాలు వెళ్లి విరిసే రక్షాబంధన్ ను కుటుంబ సభ్యుల మధ్య ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిలుపుమేరకు జాతీయ సమైక్య రక్షాబంధన్ వేడుకల్లో మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news