విమర్శలు చేయడం తప్ప మంత్రులు వారిపని వారు చేయడం లేదు – నాగబాబు

-

వైసిపి మంత్రులపై కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన నేత నాగబాబు. మంత్రులకు ఏ పని లేదని.. విమర్శలు తప్ప వారి పని వారు చేయడం లేదన్నారు. శ్రీకాకుళంలో యువశక్తి కార్యక్రమం సభ స్థానంలో నాగబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో యువతతో సభా అనేది చాలా అవసరం అన్నారు. ఆలోచన, ఆవేదన చెప్పడానికి ఇదే మంచి అవకాశం అన్నారు నాగబాబు.

యువత చాలా పవర్ఫుల్ అని.. ఈ సభను యువత అవకాశంగా తీసుకోవాలన్నారు. యువత భవిష్యత్తు కోసం కంకణం కట్టుకున్న పార్టీ జనసేన పార్టీ అన్నారు. యూత్ పవర్ కి రణస్థలం పేరు తగ్గట్టుగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఉద్యోగాలు లేవు, అవకాశాలు లేవన్నారు. యువతకి జనసేన పార్టీ వెన్నుదన్నుగా ఉంటుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news