హైదరాబాద్‌ ప్రజలకు గుడ్‌ న్యూస్‌..రూ.1200 కోట్ల మంచినీటి సరఫరా

-

హైదరాబాద్‌ మణికొండ అల్కాపురి టౌన్‌ షిప్‌ లో ఓఆర్‌ఆర్‌ ఫేజ్‌2 నీటి సరఫరా పనులకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. రూ.1200 కోట్ల వ్యయంతో.. ఓఆర్‌ఆర్‌ పరిధి ఆవాసాలకు నీటి చేయనున్నామని ఈ సందర్భంగా కేటీఆర్‌ ప్రకటన చేశారు. వ్యూహం ప్రకారం ప్రజల కనీస అవసరాలు తీర్చడానికే కేసీఆర్ ప్రాధాన్యత అని.. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు దేశానికి స్ఫూర్తి దాయకమని కొనియాడారు.

తెలంగాణలో ఈ రోజు అమలు అవుతున్న పథకాలు దేశంలో రేపు అమలు అవుతున్నాయి…మంచినీటి సరఫరా, రైతు బంధు పథకాలు కేంద్రం అమలు చేస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 24 గంటల కరెంట్ సరఫరా అవుతుంది…కొండపోచంపల్లి నుంచి గండి పేటకు మంచినీటి సరఫరాకు సీఎం కేసీఆర్ ఆలోచన అని వెల్లడించారు. తెలంగాణ ఏర్పాటు కాగానే 2 వేల కోట్ల తో డ్రింకింగ్ వాటర్ స్కీమ్ తీసుకున్నామని.. హైదరాబాద్ అంటే… GHMC ఒక్కటే కాదు… ORR లోపల ఉన్న 25 మున్సిపాలిటీలను హైదరాబాద్ గా గుర్తించాలన్నారు. హైదరాబాద్ అన్ని నగరాల కంటే వేగంగా విస్తరిస్తోందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news