ముసలి నక్క చంద్రబాబు చేసే ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలి – మంత్రి దాడిశెట్టి రాజా

-

కాకినాడ: టిడిపి అధినేత నారా చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి దాడిశెట్టి రాజా. తునిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఖాళీ కుర్చీలకు ఉపన్యాసం ఇచ్చే పరిస్థితి లో చంద్రబాబు ఉన్నాడని ఎద్దేవా చేశారు. మతాలు, కులాల మధ్య గొడవలు సృష్టించడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం అంటూ లేదని మండిపడ్డారు దాడిశెట్టి రాజా.

తుని లో కులాల మధ్య కుంపట్లు సృష్టించడానికి యనమల రామకృష్ణుడు ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. ముసలి నక్క చేసే ప్రయత్నాలను తుని ప్రజలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు మంత్రి దాడిశెట్టి రాజా. రాష్ట్ర ప్రజలు జగన్ మా నమ్మకం అనుకుంటున్నారని.. చంద్రబాబు పరిపాలన వద్దని ప్రజలు అంటున్నారని తెలిపారు. ఇప్పటివరకు 98 శాతం ఎన్నికల హామీలు పూర్తి చేశామన్నారు. గతంలో టీడీపీ ఎమ్మెల్యేలు ప్రజలలోకి రావడానికి భయపడే వారని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news