మునుగోడులో హుజూరాబాద్ కన్నా గొప్ప తీర్పు వస్తది : ఈటల రాజేందర్‌

-

మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ సమరభేరి పేరిట నేడు భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సభలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ పాల్గొని మాట్లాడుతూ.. మునుగోడు ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిండని అన్నారు. ప్రజలు ఇచ్చిన ధైర్యంతో పదవి వదులుకున్న ఆయనను నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు ఈటల రాజేందర్‌. ఉప ఎన్నిక వస్తే మునుగోడులో హుజూరాబాద్ కన్నా గొప్ప తీర్పు వస్తదని ఈటల ధీమా వ్యక్తం చేశారు ఈటల రాజేందర్‌. తెలంగాణ గడ్డ మీద బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు ఈటల రాజేందర్‌.

మునుగోడు ఉప ఎన్నికలో కేసీఆర్ పార్టీని ఓడగొట్టాలని ఈటల పిలుపునిచ్చారు. కాళ్లల్లో కట్టె పెట్టే విధంగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నాడని ఫైర్ అయ్యారు ఈటల రాజేందర్‌. బీజేపీ సభ సక్సెస్ కావద్దని నిన్న మీటింగ్ పెట్టుకుండని ఆరోపించారు ఈటల రాజేందర్‌. మునుగోడు గడ్డ మీద బీజేపీ గెలిస్తే బంగాళాఖాతంలో వేస్తరని ఆయననే చెప్పుకుంటున్నడని, అది తప్పకుండా జరుగుతదని చెప్పారు ఈటల రాజేందర్‌. ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ మోటర్లకు మీటర్లు పెడ్తరని అబద్దపు ప్రచారం చేస్తున్నారని, సీఎం చేస్తున్న ప్రచారం తప్పని హుజూరాబాద్ లో నిరూపితమైందని చెప్పారు ఈటల రాజేందర్‌.

Read more RELATED
Recommended to you

Latest news