తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దమ్మున్నోడు : జగ్గారెడ్డి

-

ప్రధాని హోదాలో తెలంగాణ కు వచ్చిన మోడీ..ఎటువంటి హామీలు ఇవ్వకుండా కేవలం రాజకీయ విమర్శలు చేయడం సరైంది కాదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఏం చేస్తున్నారు.. తెలంగాణ సమస్య ప్రధాని దృష్టి కి ఎందుకు తీసుకెళ్ళలేదనని ఆయన ప్రశ్నించారు. ప్రతీ పేదవాడి అకౌంట్ లో 15లక్షలు వేస్తా అన్న హామీ ఎందుకు ప్రధాని మాట్లాడడం లేదని, రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ఆయన అన్నారు. అంతేకాకుండా కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఏప్పుడైనా గుడికి పోయారా అని ప్రశ్నించారు. బండి సంజయ్ వాఖ్యలు దేనికి సంకేతమని, బండి సంజయ్ ముస్లింలను వేరు చేస్తూ.. హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

No plans to quit Congress, says Jagga Reddy

ప్రధానిని నిలదిసే దమ్ము లేని బండి సంజయ్.. మసీదు లను తవ్వుతానడం..రెచ్చగొట్టడమేనని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. కానీ కాంగ్రెస్ అలా కాదు.. హిందూ, ముస్లిం, సిక్కులు అందరూ బాగుండాలని కోరుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ మోడీని, మోడీని కేసీఆర్ తిడితే.. ప్రజల కడుపు నిండుతదా అని ఆయన అన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దమ్మున్నోడని, ప్రజల ముందు ప్రధానిని నిలదీసిన వ్యక్తి స్టాలిన్.. ముఖ్యమంత్రి అంటే అలా ఉండాలని ఆయన కొనియాడారు. స్టాలిన్ నేను తమిళంలో మాట్లాడుతా అంటూనే జీఏస్టీ నిధులు అడిగారని, కేసీఆర్, మోడీల అండర్ స్టాండింగ్ టూర్ లా ఉందంటూ ఆయన చురకలు అంటించారు.

Read more RELATED
Recommended to you

Latest news