అధ్యక్ష పదవికి నేను కూడా అర్హుడినే : దుబ్బాక ఎమ్మెల్యే రఘు

-

తాజాగా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వార్త వివిధ రాష్ట్రాలలో బీజేపీ అధ్యక్షులుగా ఉన్న వారిని మార్చే దిశగా బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్న విషయం.. ఈ మార్పులు ఏమిటన్నది ఇంకాసేపట్లో బీజేపీ ప్రకటించనుంది. ఈ లోపు తెలంగాణ బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే గా ఉన్న రఘునందన్ రావు తాజాగా మాట్లాడుతూ.. మీడియాలో గత కొద్దీ రోజుల నుండి అధ్యక్షుడిని మార్చనున్నారు అన్న వార్తలు నిజమేనన్నారు. పది సంవత్సరాల పాటుగా నేను బీజేపీ కోసం తీవ్రంగా కష్టపడ్డానన్నారు. రాష్ట్రము అంతటా కేసీఆర్ పవర్ ఉన్న రోజుల్లో దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికలో నేను కస్టపడి గెలిచానన్నారు. దుబ్బాకలో ప్రజలు నన్ను నా కష్టాన్ని చూసి ఓట్లు వేశారన్నారు. ఇక నా గెలుపును చూసి ఈటల రాజేందర్ బీజేపీలోకి వచ్చారని కామెంట్ చేశారు. నేను కూడా తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి అర్హుడనే అంటూ తనకు తానుగా చెప్పుకున్నాడు.

ఇంకా ఈయన కేంద్రానికి కొన్ని ఛాయస్ లు కూడా ఇవ్వడం గమనార్హం.. రాష్ట్ర అధ్యక్ష పదవి లేదా ఫ్లోర్ లీడర్ లేదా జాతీయ అధికార ప్రతినిధి పదవి అయిన ఇవ్వండి అంటూ బీజేపీ అధిష్టానానికి తన మొర వినిపించుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news