ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరోసారి తెరపైకి ఎమ్మెల్సీ కవిత పేరు

-

ఢిల్లీ లిక్కర్ కేసులో మరోసారి బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు తెరపైకి వచ్చింది. మాగుంట రాఘవ రిమాండ్ రిపోర్ట్ లో కవిత పేరును వెల్లడించిన ఈడి.. మద్యం విధానం రూపకల్పనలో కుట్రకు పాల్పడ్డారని పేర్కొంది.

ముందు గానే అమ్ అద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయల ముడుపులు చెల్లించారని… ఈ ముడుపులను తిరిగి రాబట్టుకునేందుకు ఇండో స్పిరి ట్స్ అనే స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేశారని తెలిపారు ఈడీ అధికారులు.

సౌత్ గ్రూపుకు ఇందులో 65% వాటా ఉందని…ఈ సౌత్ గ్రూపులో కవితతో పాటు శరత్ రెడ్డి, మాగుంట రాఘవ్ ఉన్నారన్నారు. ఇండోస్పిరిట్ లో కవిత తర పున అరుణ్ పిళ్ళై ప్రతినిధిగా వ్యవహరించారు…హోల్సేల్ డీలర్లకు 12 శాతం కమిషన్ , రిటైల్ వ్యాపారులకు 185 శాతం కమిషన్ వచ్చేలా మద్యం పాలసీ రూపొందించారని తెలిపారు ఈడీ అధికారులు. ఈ కమిషన్ను మళ్లించేందుకు ఇండస్పిరిట్ స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేశారు..కార్టలైజేషన్ ద్వారా అనుచిత లబ్ధి పొందారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news